- Advertisement -
GHMC ఇప్పుడు వినూత్న ప్రచారానికి తెర లేపింది. స్వచ్చ భారత్ వైపు సీరియస్ గా అడుగులు వేస్తున్న GHMC వారు తడి , పొడి చెత్త ని వేరు వేరు గా సేకరించాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమం లో జనాల్లో చైతన్యం తీసుకుని న్రావడం కోసం GHMC అధికారులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి మహిళలకి బొట్టు పెట్టి , వారికి ఆ రెండింటి మధ్యనా తేడా ని వివరిస్తారు.
ఈ ప్రచారానికి మంచి స్పందన వస్తోందని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. పార్కులు, హోటళ్లు, కాలనీలు, రెస్టారెంట్లలో కంపోస్టింగ్ ఎరువుల తయారీకి ప్రత్యేకంగా గుంతలు తవ్వించుకోవాలనే దిశగా అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలు పాటించడం వల్ల హైదరాబాదును స్వచ్ఛ హైదరాబాద్ గా మారుస్తామని తెలిపారు.