Sunday, May 19, 2024
- Advertisement -

ఏలూరులో టీడీపీ అరాచకం..

- Advertisement -

ఎన్నికల ప్రచార పర్వం దగ్గర పడుతున్న కొద్ది దాడులకు తెగబడుతున్నారు టీడీపీ నేతలు. ప్రజాక్షేత్రంలో తీర్పు ఇప్పటికే అర్థమైపోవడంతో భయబ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రౌడీల్ల ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. సునీల్ వాహనాన్ని చుట్టుముట్టి కారు అద్దాలు ధ్వంసం చేశారు.

టీడీపీ కార్యకర్తలను దాడికి ఉసిగొల్పుతూ గత కొన్ని రోజులుగా పబ్లిక్ మీటింగ్‌ల్లో చంద్రబాబు, నారా లోకేష్ స్పీచ్‌లు ఉండటంతో అరాచక శక్తులుగా మారి టీడీపీ గుండాలు విధ్వంసం సృష్టిస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జంగారెడ్డి గూడెంలో ఎన్నికల ప్రచార కర్యక్రమం ముగించుకుని సునీల్ నూజివీడు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్రలతో టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని తెలిపారు సునీల్. రాజకీయాలు హుందాగా చేయాలి కానీ ఇలా దాడులకు తెగబడటం సరికాదని, ఓడిపోతామనే భయంతోనే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -