- Advertisement -
హైదరాబాద్లో పబ్కు వెళ్లిన బాలికను బయటకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఐదుగురు యువకులు అమ్మాయి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఆదివారం కొత్తగా మరో వీడియో బయటపడింది.
కారు రన్నింగ్లో ఉండగానే.. అమ్మాయి పట్ల అందులో ఉన్న యువకులు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తీరును రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read
మంత్రి కొప్పులు నా సీటు లాగేసుకున్నారు