Monday, April 29, 2024
- Advertisement -

1200 కోట్లతో కుదిరిన ఒప్పందం

- Advertisement -

ఐటి దిగ్గజ సంస్ధ టెక్ మహేంద్ర బ్రిటన్ లోని అతి పెద్ద సంస్ధ టార్గెట్ ను హస్తగతం చేసుకుంది. 12 కోట్ల పౌండ్లు అంటే దాదాపు 1200 కోట్ల రూపాయలతో ఈ రెండు కంపెనీల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ కంపెనీని కొనుగోలు చేయడం వల్ల బ్యాంకింగ్, బీమా, ఆర్దిక సర్వీసుల రంగాల్లో టెక్ మహేంద్రా తిరుగులేని సంస్ధగా మారుతుందని కంపెనీ యాజమాన్యం ఆశిస్తోంది.

బ్రిటన్ లో బిఎఫ్ఎస్ఐ వార్షిక వ్యయం 4500 నుంచి 6 వేల కోట్ల పౌండ్లు ఉంటుందని, ఈ నూతన కొనుగోలుతో మార్కెట్ లో తాము భారీ వాటాదారులుగా మారతామని కంపెనీ పేర్కొంది.  12 కోట్ల పౌండ్లతో కుదిరిన ఒప్పందంలో 6.4 కోట్ల పౌండ్లను తాము నేరుగా చెల్లించామని, మరో 1.62 కోట్ల పౌండ్లను 2017 సంవత్సరంలో చెల్లించేలా ఒప్పందం కుదిరిందని టెక్ మహేంద్రా పేర్కొంది.

దీంతో పాటు టార్గెట్ గ్రూప్ నకు ఉన్న 1.71 కోట్ల పౌండ్ల రుణాన్ని తాము చెల్లించనున్నామని తెలిపింది. తాము టార్గెట్ గ్రూప్ ను కొనుగోలు చేసినా కంపెనీ నిర్వహణ, యాజమాన్య బాధ్యతల్లో ఆ గ్రూప్ వ్యవహరిస్తుందని కూడా టెక్ మహేంద్రా యాజమాన్యం పేర్కొనడం విశేషం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -