ఇప్పుడు వారసత్వం కావాలి.. తన ఆస్తిని.. తన వారసత్వం పంచుకోవడానికి కుమారుడు లేడని ఓ వ్యక్తి మరో పెళ్లి చేసుకున్నాడు. ఇంతకుముందు ఉన్న కొడుకు చనిపోవడంతో ఆందోళనలో ఉన్నాడు. కొడుకు లేడని భావించి మళ్లీ కొడుకు కోసం 83 ఏళ్ల వృద్ధుడు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన రాజస్థాన్లో జరిగింది.
రాజస్థాన్లోని కరౌలి జిల్లా సోమ్ రైదా గ్రామానికి చెందిన సుఖ్రామ్కు 50 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. అయితే అతడికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కొడుకు 15 ఏళ్ల కిందట చనిపోయాడు. దీంతో కొడుకు కోసం మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. 83 ఏళ్ల వయసులో సుఖ్రామ్ మళ్లీ పెళ్లి కొడుకయ్యాడు. ఆదివారం (ఫిబ్రవరి-18) జరిగిన పెళ్లిలో సుఖ్రామ్ గుర్రం ఎక్కి వీధుల్లో ఊరేగుతూ పెళ్లి చేసుకున్నాడు. తన వయసులో సగం కూడా లేని 30 ఏళ్ల రమేషి దేవిని ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి సుఖ్రామ్ మొదటి భార్య కూడా హాజరైంది.