స్టీల్ప్లాంట్ లేకపోతే విశాఖ లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖలో పల్లా శ్రీనివాస్ను ఆస్పత్రిలో పరామర్శించిన చంద్రబాబు… ఈ సందర్భంగా మాట్లాడారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారని చంద్రబాబు కొనియాడారు. ఆనాటి పోరాటానికి స్వయంగా ఇందిరాగాంధీనే దిగివచ్చారన్న చంద్రబాబు… అన్నిటికంటే విశాఖే మంచిదని ఆ రోజే కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు.
పోర్ట్ బేస్లో ఎక్కడా స్టీల్ప్లాంట్ లేదని.. విశాఖలోనే ఉందని చంద్రబాబు వివరించారు. ఆనాడు రైతులిచ్చిన భూమి విలువ ఇవాళ రూ.వేల కోట్లు ఉంటుందని చెప్పారు. 5 లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ.. విశాఖ ఉక్కు పరిశ్రమని… ఉక్కు పరిశ్రమ నుంచి ఇప్పటివరకు రూ.33 వేల కోట్ల పన్నులు కట్టారని చంద్రబాబు వివరించారు. ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు కూడా రూ.వేల కోట్ల పన్నులు కట్టారన్న చంద్రబాబు… వాజ్పేయీ హయాంలో బీఈఎఫ్ఆర్కు వెళ్తే రూ.1,300 కోట్లు ఇచ్చి ఊపిరిపోశారని గుర్తుచేశారు.
రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఎప్పటికీ విశాఖే ఉంటుందని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖలో విమానాశ్రయం, మెట్రోకు శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు… విశాఖకు ఐటీ పరిశ్రమ, లులు షాపింగ్మాల్ రాకుండా చేశారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రాజెక్టులూ ఇప్పుడు వెళ్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు పాలకులా.. కమీషన్ ఏజెంట్లా..? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు సంకల్పాన్ని కొనేయాలనుకుంటున్నారా అని నిలదీశారు. సీఎం జగన్ ఏమయ్యారు..? పబ్జీ ఆడుకుంటున్నారా..? అని ఆగ్రహంగా ప్రశ్నించారు.
మళ్ళీ వర్షాలు.. ఈసారి ఏం అవుతుందో..!
పంటపొలాల్లో కేసిఆర్ పుట్టిన రోజు వేడుకలు..!