Monday, May 6, 2024
- Advertisement -

కేసీఆర్ పుట్టినరోజుకి సత్యవతి రాఠోడ్ గిఫ్ట్ ఇదే..!

- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమ శాఖలో మూడు లక్షల మొక్కలు నాటనున్నట్లు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. ఎంపీ సంతోశ్​కుమార్ చేపట్టిన కోటి వృక్షార్చన పిలుపులో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ, ఆశ్రమ పాఠశాలల్లో లక్ష మొక్కలు, గిరిజన గురుకులాల్లో లక్ష మొక్కలు, మహిళాభివృద్ధి- శిశు సంక్షేమ శాఖలో మరో లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ఆదిమ జాతి గిరిజన బాలికల విద్య కోసం దేశంలో మొదటిసారి ఏర్పాటు చేసిన గురుకులంలో ఒకటైన హయత్​నగర్​లోని గిరిజన బాలికల గురుకులంలో మొక్కలు నాటి బాలికలకు నూతన దుస్తులు అందిస్తామని మంత్రి తెలిపారు. కూకట్​పల్లిలోని మహిళా, శిశు సంక్షేమశాఖ రెస్క్యూ హోమ్​లో కేవలం పండ్లు, పూలు, కూరగాయల మొక్కలు పెట్టి న్యూట్రీ గార్డెన్​గా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ గార్డెన్లలో వచ్చే కూరగాయలు, పండ్లు మహిళలు, శిశువులకు ఇచ్చే పౌష్ఠికాహారంలో భాగం చేయనున్నారు.

వేరే దేశం పౌరుడు ఇక్కడ చట్ట సభలో 10 ఏళ్ళ నుంచి ఉంటే..!

కోటి వృక్షార్చన మొదలైనట్టే.. మొదట ఎవరంటే..!

మధ్యప్రదేశ్‌లో అదుపుతప్పి కాల్వ‌లో ప‌డిన బ‌స్సు.. 32 మంది మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -