రెండు తెలుగు రాష్ట్రాల్లో దివంగత మాజీ మంత్రి పరిటాల రవికి.. ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. రాయలసీమలో ఓ వర్గం అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని.. తనకంటూ రవి ఓ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నారు ఆయన.
రవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో 2005లో ప్రత్యర్థులు ఎటాక్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఆయన భార్య సునీత రాజకీయాల్లోకి వచ్చి.. ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన సునీత ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఇక సునీత రవి వారసుడు శ్రీరామ్ను రాజకీయంగా బలమైన శక్తిగా సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో శ్రీరామ్ రాజకీయంగా బాగా బిల్డప్ అవుతున్నాడు.
{loadmodule mod_custom,GA2}
తండ్రితో వచ్చిన క్రేజ్ను నిలబెట్టుకుంటూ యూత్లోను, టీడీపీలోను మంచి పట్టు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం టీడీపీ యూత్ ఐకాన్స్లో ఒకడైన శ్రీరామ్ను తల్లి సునీత ఓ ఇంటివాడిని చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెపథ్యంలో.. అనంతపురం జిల్లాలో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేత కుమార్తెతో శ్రీరామ్ పెళ్లి నిశ్చయమైనట్టు తెలుస్తోంది. ఎన్నో సంబంధాలు చూసిన శ్రీరామ్ చివరకు.. ఈ అమ్మాయిని ఓకే చేసినట్లు తెలుస్తోంది. పరిటాల కుటుంబంలో కి వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో అన్ని ఇప్పటిదాకా అభిమానులు వెయిట్ చేస్తుండగా…ఇప్పుడు శ్రీరామ్కు జోడీగా వచ్చే అమ్మాయి మంచి పేరున్న ఫ్యామిలీ నుంచే వస్తుందని తెలియడంతో వారంతా సంతోషంగా ఉన్నారు. ఈ పెళ్లికి సంబంధించి.. పూర్తి వివరాలు మరో రెండు రోజుల్లో వెల్లడి కానున్నాయి.
{youtube}wGpl8NxtKDE{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related