- Advertisement -
భూసేకరణ పై సినీ నటుడు మరియు జనసేన పార్టీ అద్యక్షుడు మరోసారి ట్విట్టర్లో స్పందించాడు.
ఎపి రాజధాని నిర్మాణానికి కావాల్సిన మిగతా భూమికి భూసేకరణ చట్టాన్ని అమలు చేయవద్దని జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. భూసేకరణ సమస్యను సామరస్య వాతావరణంలో పరిష్కరించి.. ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.
“భూ సమీకరణ సమస్యని సామరస్య వాతావరణంలో పరిష్కరించి ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను.” ఇలా పవన్ కల్యాన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు టిడిపికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇక ముందు పవన్ కార్యాచరణ ఎలా ఉండబోతోందో చూడాలి.