- Advertisement -
జనసేన అధినేత, ప్రముఖ సినీ హీరో పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి కాకినాడకు చేరుకున్నారు. ఇక్కడి జీఆర్టీ హోటల్లో పవన్ కళ్యాణ్ బస చేయనున్నారు. కాగా… హోటల్ ప్రాంతంలోకి మీడియాకు అనుమతిని నిరాకరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఆత్మగౌరవ సభ పేరుతో రేపు కాకినాడలోని జేఎన్టీయూకే గ్రౌండ్లో సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు.