Monday, April 29, 2024
- Advertisement -

మనిషి నుంచి కుక్కకు కరోనా వైరస్.. ఎక్కడంటే ?

- Advertisement -

ఇప్పటివరకు కరోనా వైరస్ కేవలం మనుషులపైనే పంజా విసిరింది. ఇప్పుడు జంతువులపై కూడా తన పంతా చూపుతోంది. హాంకాంగ్ లో ఓ పెంపుడు కుక్కకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మనిషి నుంచి జంతువుకు కరోనా వైరస్ సోకిన తొలి కేసుగా ఇది ప్రపంచ రికార్డుపుటల్లోకి ఎక్కింది.

ఈ కుక్కను 60 ఏళ్ల మహిళ పెంచుకుంటోంది. ఆమె నుండే కరోనా వైరస్ కుక్కకు వచ్చింది. దాంతో దాన్ని జంతువుల క్వారంటైన్ కు పంపించారు. గత శుక్రవారం నుంచి దానికి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో దానికి బలహీన స్థాయిలో కరోనా వైరస్ ఉందని రిపోర్ట్ వస్తోంది. గత శుక్రవారం హాంకాంగ్ ప్రభుత్వం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక క్వారంటైన్ ను ఏర్పాటు చేసింది.

వైరస్ బారిన పడిన జంతువులను 14 రోజుల పాటు అక్కడ ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తున్న మరో రెండు కుక్కలను ఐసొలేషన్ లో ఉంచారు. ఈ రెండు కుక్కలలో ఒక దానికి కరోనా నెగెటివ్ అని తేలింది. దానికి మరోసారి పరీక్ష నిర్వహించి, మళ్లీ నెగెటివ్ అని తేలితే ఐసొలేషన్ నుంచి విడుదల చేయనున్నారు. మరో కుక్క గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -