Friday, May 10, 2024
- Advertisement -

అయోధ్య మసీదు పై మళ్ళీ సుప్రీంలో పిటిషన్..!

- Advertisement -

అయోధ్యలో మసీదును నిర్మించేందుకు ఏర్పాటైన ఇస్లామిక్​ కల్చరల్​ ఫౌండేషన్​ ట్రస్టులో ప్రభుత్వం నామినేట్ చేసిన ప్రతినిధులకు చోటు కల్పించాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సున్నీ వక్ఫు బోర్డుకు ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొంది. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని శుక్రవారం విచారించిన అనంతరం.. జస్టిస్​ ఆర్​ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శ్రీరామ జన్మభూవి తీర్థక్షేత్ర ట్రస్టులో ప్రభుత్వం నామినేట్​ చేసిన ప్రతినిధులకు చోటు కల్పించినట్లే.. మసీదును నిర్మించే ట్రస్టులో కూడా యూపీ, కేంద్ర ప్రభుత్వాలు నామినేట్​ చేసే ప్రతినిధులకు అవకాశం ఇవ్వాలని యూపీకి చెందిన న్యాయవాదులు శిశిర్ చతుర్వేది, కమలేశ్ కుమార్ శుక్లా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఇస్లామిక్​ కల్చరల్​ ఫౌండేషన్​ ట్రస్టుకు దేశ విదేశాల నుంచి నిధులు వస్తాయని.. వీటి నిర్వహణ, పారదర్శకత కోసం ఈ మేరకు ఆదేశాలివ్వాలని కోరారు. పిటిషన్​ను పరిశీలించిన అత్యున్నత ధర్మాసనం ఆ అవసరం లేదని స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -