Sunday, May 19, 2024
- Advertisement -

ప్రధానిగా రెండో సారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం…

- Advertisement -

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ కూట‌మి అఖండ విజ‌యం సాధించి పెట్టిన న‌రేంద్రమోదీ భార‌త ప్ర‌ధానికిగా రెండో సారి సాయంత్రం ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాధ్ కోవింద్ ప్రధానిగా మోదీతో ప్రమాణం చదివించారు.నరేంద్ర దామోదర్ దాస్ అను నేను అంటూ మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మోదీ ప్రమాణ పత్రం చదువుతున్న సమయంలో బోలో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో రాష్ట్రపతి భవన్ పరిసరాలు మార్మోగిపోయాయి.

ఈ కార్య‌క్ర‌మానికి దేశవిదేశాలకు చెందిన అతిరథ మహారథులు రావడంతో రాష్ట్రపతి భవన్ లో కోలాహలం అంబరాన్నంటింది. బిమ్ స్టెక్ దేశాల అధినేతలు, పలు దేశాల ప్రతినిధులు, రజనీకాంత్, కంగనా రనౌత్, కరణ్ జోహార్ వంటి సినీ తారలు, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తదితరులు హాజరయ్యారు.

రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, సదానంద గౌడ, నిర్మలా సీతారామన్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, నరేంద్రసింద్‌ తోమర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌, థావర్‌చంద్‌ గెహ్లాట్‌, సుబ్రమణ్యం జయశంకర్‌, రమేష్‌ పోఖ్రియాల్‌, అర్జున్‌ ముండా, సృతి ఇరానీ కేబినెట్‌, డాక్టర్‌ హర్షవర్థన్‌, ప్రకాశ్‌ జవదేకర్‌, పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, ప్రహ్లాద్‌ జోషి మంత్రులుగా ప్రమాణం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -