Wednesday, May 15, 2024
- Advertisement -

హైద‌రాబాదీయుల క‌ల‌ల‌బండి మెట్రోరైల్ ప్రారంభం…. మెట్రోరైల్లో కేటీఆర్‌తో ముచ్చ‌ట్లు..

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మియాపూర్‌లో హైదరాబాద్ మెట్రో రైలును ఆవిష్కరించారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి మియాపూర్ చేరుకున్న మోడీకి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తదితరులు స్వాగతం పలికారు. అక్క‌డే భాజాపా ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌సంగించిన మోదీ హెలీకాప్ట‌ర్‌లో మియాపూర్ చేరుకున్నారు.

అనంత‌రం రాజ‌ధాని వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క‌ల‌ల బండి మెట్రోరైల్ ప్రారంభమైంది. మియాపూర్‌లో మెట్రోరైల్ పైలాన్‌ను ప్రారంభించిన అనంత‌రం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మోట్రోపై రూపొందించిన బ్రోచ‌ర్‌, దృశ్య‌మాలిక‌ను విడుద‌ల చేశారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో క‌లిసి దృశ్య‌మాలిక‌ను వీక్షించారు.

ప్రధాని నరేంద్ర మోడీ మెట్రోలో ప్రయాణించే సమయంలో ఆయన వెంట సీఎం కేసీఆర్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్, బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ఎల్ అండ్ టి అధికారులు ఉన్నారు. అనంత‌రం మోదీ హెచ్ఐసీసీకి బ‌య‌లుదేరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -