తెలంగాణ నుంచి చింతలపూడికి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించగా.. ట్రాక్టర్లో కోళ్ల పెంట మధ్య ఉంచి 1100 తెలంగాణ మద్యం సీసాలను గుర్తించారు.
మద్యం తరలించే విధానాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ట్రాలీలోని పెంటలో మద్యం తరలిస్తుండగా చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు.. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు.తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి ట్రాక్టర్పై కోళ్ల పెంటను చింతలపూడికి తరలించాలని..
ఆ లోడును గంగారం అడ్డరోడ్డు వద్ద ఎరువు అన్లోడ్ చేసి తనకు అప్పగించాలని చెప్పినట్లు డ్రైవర్ తెలిపాడు. అందులో మద్యం ఉన్నట్లు తనకు తెలియదని చెప్పడంతో.. అసలు వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుకున్న మద్యం సీసాల విలువ సుమారు 12 లక్షల విలువ ఉంటుందని చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.
షర్మిల అభిమానులకి చేదు వార్త.. అంతా వాయిదా..!
నేను సీఎం మనిషిని..రూ.50 వేలు పంపు..!
మేయర్ విజయలక్ష్మికి ఫ్లెక్సీ షాక్..!
ఘట్కేసర్ అత్యాచారం కేసు.. ట్విస్టుల మీద ట్విస్టులు.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్!