- Advertisement -
విజయనగరం జిల్లా ఏవోబీ సరిహద్దులోని 7 గ్రామాల్లో పోలింగ్ ప్రారంభం కాలేదు. పట్టుచెన్నూరు, పగలుచెన్నూరు, గంజాయిభద్రలో పోలింగ్ ఇంకా ప్రారంభించలేదు. ఓటర్లు బయటకు రాకుండా ఒడిశా భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయి. కొవిడ్ సాకు చూపించి కొఠియా గ్రామాల్లో ఆంక్షలు విధించింది ఒడిశా ప్రభుత్వం.
కరోనా దృష్ట్యా చర్యలు చేపడుతున్నట్టు లేఖ విడుదల చేసింది. గంజాయిభద్ర నుంచి వచ్చే దారులను మూసేసి పోలీసులతో పహారా చేపట్టింది. ఏపీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్టేటస్ కోను ఉల్లంఘిస్తున్నారని అంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 12 గంటల సమయానికి పోలింగ్ 21.65 శాతంగా నమోదైంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 25.96 శాతంగా నమోదు కాగా.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 15.05 శాతంగా ఉంది.
‘వకీల్ సాబ్’ హీరోయిన్ కు కరోనా