Thursday, May 2, 2024
- Advertisement -

ఏపీ పాలిటిక్స్‌కు జగన్ బెటర్.. పవన్ కి షాక్ ఇచ్చిన పోసాని!

- Advertisement -
posani tells difference between jagan babu

ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. పోసాని గతంలో ప్రజారాజ్యం తరపున ఎన్నికల బరిలో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ సినిమాలపైనే దృష్టి పెట్టారు. నేను లోకల్ సినిమాలో నానికి తండ్రిగా పోసాని కీలక పాత్ర పోషించారు. ఇటివలే పోసాని ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను తెలిపాడు. ప్రస్తుతం అడపాదడపా రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు.

ఆ మధ్య ఓ టీవీ ఛానెల్ రాజకీయ చర్చలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌పై ఆయన మాట తూలడం తీవ్ర వివాదస్పదమైంది. ఈ నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించి పోసాని ఆసక్తికర కామెంట్ చేశారు. చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్.. ఈ ముగ్గురిలో ఏపీకి ఎవరైతే బెటర్? అన్నప్రశ్నకు ‘జగన్’ అని సమాధానం చెప్పేశారు పోసాని. ‘దేవుడా.. దేవుడా.. మాయదారి దేవుడా.. ఈ ముగ్గురిలో నాకు జగన్ అంటే ఇష్టం’ అని బదులిచ్చారు.

మోడీ జపం చేస్తున్నారే భయంతోనా? లేకుంటే నల్లధనం దాచుకున్నారా? అని పోసానిని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ‘పోసాని కృష్ణ మురళీకి ఈ రోజు ఏం కావాలి చెప్పండి? నేను బీజేపీ మెంబర్ కూడా కాదు’ అన్నారు. బ్లాక్ మనీ ఉంటే తీసుకెళ్లండి.. ఐటీ వాళ్లకి చెప్పండి.. డబ్బుల్లేక మా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆ పరిస్థితి తనకు రాకూడదని తన బిడ్డలు, తాను సంతోషంగా బతికేందుకు కావాల్సిన డబ్బు సంపాధించుకున్నానని పోసాని తెలిపారు.

Related

  1. పోసాని భార్య దగ్గర బోయ‌పాటి చీప్ ప్రవర్తన!
  2. టీవి లైవ్ లో వీహెచ్‌ను పిచ్చి బూతులు తిట్టిన పోసాని
  3. పవన్, జగన్ కలవనున్నారా..?
  4. మళ్లీ పవన్ ఫ్యాన్స్.. బన్నీ ఫ్యాన్స్ మధ్య.. పెద్ద గొడవ.. ఏం జరిగింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -