Thursday, May 16, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ మీద కోపంగా ఉన్న అభిమానులు

- Advertisement -

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం నోవోటెల్ లో పార్టీ ప్రకటించి హడావిడి చేసాడు పవన్ కళ్యాణ్. ఆర్భాటం గా పార్టీ ని స్థాపించి భారీ ఎత్తున సభలు నిర్వహించి మరీ ప్రజల్లో భారీ ఊపుని తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్. బీజేపీ – తెలుగు దేశం పార్టీలకి గట్టి ప్రచారం చేసి ఆ పార్టీలు ఏపీ లో గెలిచేలా చేసి అధికారం కూడా ఎక్కేలా చేసాడు పవన్ అయితే ఆ తర్వాత పవన్ ఎక్కడా కనపడ్డం లేదు అనే కోపం లో ఉన్నారు సామాన్య జనాలు.

మామూలు వారి సంగతి పక్కన పెడితే స్వయంగా జన సేన కార్యకర్తలు. ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసుకుని ప్రజల్లోకి వస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్. ఆ తరవాత తన ఫోకస్ అంతా పార్టీ మీదనే పెడతా అంటున్నాడు. అయితే జనసేన ఫాన్స్ మాత్రం దీనికి సుముఖంగా లేరు. సర్దార్ టైం లో కూడా ఇదే చెప్పాడు అనీ వరసగా డాలీ , త్రివిక్రమ్ లతో సినిమాలు ఓకే చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇంకెప్పుడు ఒరిజినల్ పాలిటిక్స్ లోకనిపిస్తాడు అంటూ కోప్పడుతున్నారు అభిమానులు.

పార్టీ భ‌విష్య‌త్తుకు సంబంధించి ప‌వ‌న్ కల్యాణ్ మ‌న‌సులో ఏ ఆలోచ‌న‌లు ఉన్నాయో తెలీదుగానీ, విశాఖప‌ట్నానికి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు దూసుకుపోతున్నారు. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే జీవీఎంసీ ఎన్నిక‌ల్లో అన్ని వార్డుల నుంచీ జ‌న‌సేన సొంతంగా బ‌రిలో దిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. దేశం-భాజ‌పాల‌తో పొత్తు లేకుండా సొంతంగానే ఈ ఎన్నిక బ‌రిలోకి అవ‌స‌ర‌మైన క్షేత్ర‌స్థాయి క‌స‌ర‌త్తును ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది.

Related

  1. సోష‌ల్ మీడియాలో సందడి చేస్తోన్న ప‌వ‌న్ లెట‌ర్
  2. ఇండైరెక్ట్ గా సహాయం చేసిన పవర్ స్టార్!
  3. మరోసారి గట్టి పోటికి పవర్ స్టార్!
  4. పవర్ స్టార్ ఫ్యాన్స్ vs స్టైలీష్ స్టార్ ఫ్యాన్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -