తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9,10,11 తరగతుల పబ్లిక్ పరీక్షలను రద్దు చేసింది. పరీక్షలు లేకుండానే ఆయా తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు.ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును పెంచుతున్నట్టు తెలిపారు పళనిస్వామి. 59 నుంచి 60కు పెంచుతున్నట్టు వెల్లడించారు.
మహారాష్ట్ర లాతూర్ నగరం ఎమ్ఐడీసీ ప్రాంతంలోని ఓ హస్టల్లో దాదాపు 40 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. హాస్టల్లో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా మిగతా వారికీ పరీక్షలు చేయించారు హాస్టల్ నిర్వాహకులు.మహారాష్ట్రలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అప్రమత్తమైన మహా సర్కార్.. నిబంధనలను కఠినతరం చేసింది. కేసులు అధికంగా నమోదవుతున్న నగరాల్లో ఆంక్షలు విధించింది.
‘ఉప్పెన’ మూవీలో కృతి శెట్టికి ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా?
మెదడు పనితీరు మెరుగు పడాలంటే..