స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రధాని మోదీతోపాటు నాయకులు, సినిమా ప్రముఖులు, క్రీడాకారులు ఇలా ఒక్కరనేంటి దాదాపు దేశంలోని ప్రముఖులందరు కూడా చీపురు పట్టి రోడ్లు ఉడ్చిన సంఘటనలు అనేకం జరిగాయి. కాని పుదుచ్చేరి సీఎం మాత్రం అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్ధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛతాహై సేవా’ కార్యక్రమంలో భాగంగా ఓ ముఖ్యమంత్రి మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు. నలుగురికి చెప్పే ముందు మనం ఆచరించాలని చెప్పిన ఈ వ్యక్తి పుదుచ్చేరి కాంగ్రెస్ సీఎం వీ నారాయణస్వామి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో నారాయణస్వామి స్వయంగా మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు.
నారాయణ స్వామి చేసిన పనిని మెచ్చుకుంటూ.. ‘మీరు ఏదో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కోసం ఈ పని చేస్తున్నట్లు లేరు. చాలా నిజాయితీగానే మురికి కాలువలోకి దిగి అక్కడ ఉన్న చెత్తను తొలగిస్తున్నార’ని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో సోషియల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#SwachhataHiSeva #SwachhBharat #SwachhBharatMission cleaning at #Nellithope #Puducherry pic.twitter.com/FkeKvfClZK
— V.Narayanasamy (@VNarayanasami) October 1, 2018