బాహుబలి సినిమా తర్వాత రానా నటిస్తున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఇటివలే రిలిజ్ అయింది. ఈ ట్రైలర్ కి ఇప్పుడు ఓ రెంజ్ లో స్పందన వస్తోంది. డైరెక్టర్ తేజ పాత సినిమాల మాదిరిగా కాకుండా కొత్తగా ఈ సినిమాని తీసాడని.. ఈ ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది.
{loadmodule mod_custom,GA1}
ఇప్పుడు ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే .. ఇది వై ఎస్ జగన్ కథలా అనిపిస్తుంది. ఎందుకంటే.. వందమంది ఎం ఎల్ ఎల్ లను స్టార్ హోటల్ లో కూర్చోబెడితే .. సాయంకాలానికి నేను అవుతా సీఎం ? అంటూ రానా పలికిన డైలాగ్ కి తోడు .. కర్నూల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండడం .. రానా పాత్ర దాని తీరు తెన్నులు చేస్తుంటే .. ఇది జగన్ కథలాగే ఉందనే టాక్స్ అటు జనాలనుండి జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే లెక్కేసి కొడితే .. ఐదేళ్ళలో సీఎం సీటు నా ముడ్డికిందుండాలి, అంటూ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి.
{loadmodule mod_custom,GA2}
పాముకు పుట్ట కావాలంటే చీమలు కదా కష్టపడాలి లాంటి డైలాగ్స్ హీరోలో నెగిటివ్ ని చూపిస్తున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ అయితే కాని ఇది ఎవరి కథో చెప్పాలేం. ఇక కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని వచ్చే నెలలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఒక వేళ ఈ సినిమా జగన్ కథ అయితే.. రిలీజ్ అయిన ఈ సినిమా సంచలనం రెపడం ఖాయం అంటున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}BEpqWqyqr2o{/youtube}
Related