ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇద్దరు కూతుళ్లు అనే సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు అమ్మాయిల పేర్లు.. వర్ష,హర్ష. వీరు పెద్ద మీడియాకు కనిపించారు. మామూలుగా ఇదే స్థానంలో వెరే వాళ్లు ఉంటే.. బాగా ప్రచారం అవుతారు. కానీ జగన్ కూతుర్లు.. ఎప్పుడు కూడా బయట ప్రపంచలోకి రాలేదు.
రాజకీయాలను దూరంగా ఉంచుతూ.. వీరిని పెంచుతున్నారు. వీరు బయటకు కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. మరి ఈ సంగతిలా ఉంటే.. వైఎస్ జగన్ పెద్ద కూతురు వర్ష గురించి ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ఒకటి వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే వర్ష ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సీటు సాధించిందనే మాట వినిపిస్తోంది. ఇటివలే ప్లస్ టూ కంప్లీట్ చేసిన వర్ష.. గ్రాడ్యుయేషన్ కోసం ప్రఖ్యాత విద్యాలయంలో సీటు సంపాదించిందని తెలుస్తోంది. మరి ఇది అరుదైన ఘనతే. ప్లస్ టూలో మంచి మార్కులతోపాటు.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎంట్రన్స్ టెస్టులో మంచి మార్కులుంటేనే అక్కడ సీటు దొరుకుతుంది. జగన్ కూతురు ఈ ఘనతను సాధించినట్టుగా సమాచారం. మరి రాజకీయ నేత తనయ ఇలాంటి ఘనత సాధిస్తే అది పెద్ద విశేషమే.
ఈ ఘనతతో అందరి కళ్లూ వర్ష మీద పడతాయని కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకపై ఆమె ప్రస్థానం చర్చలో ఉండే అవకాశం ఉంది. మరి జగన తన కుతుర్లని బాగా చదివించి.. రాజకేయల్లోకి తీసుకొస్తారో లేక.. మంచి జాబు సెటిల్ అయ్యేలా చేస్తారో చూడాలి.
Related