టీలీవుడ్ డ్రగ్స్ కేసులో సిట్ ముందు నిన్న జ్యోతిలక్ష్మి (ఛార్మీ కౌర్), నేడు మైసమ్మ (ముమైత్ ఖాన్) విచారణ పూర్తియ్యింది.ఇక రేపు మాస్ మహారాజా రవితేజ విచారణ జరగనుంది. రవితేజ విచారనలో పలు కీలక విషయాలు వెల్లడికానున్నాయి.కేసుకు బలమైన సక్ష్యాలుగా పనికొస్తాయనె ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే రవితేజకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో పరీక్షలకు సహకరిస్తాడా? లేదా?, అతనిని సిట్ ఏరకంగా విచారించనుందన్న ఆ సక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
ప్రముఖ నటుడు రవితేజ రేపు సిట్ ముందు విచారణకు హాజరుకానున్నాడు. సిట్ నోటీసులు జారీ చేసినవారిలో రవితేజ పేరు వెలుగు చూడడంతో టాలీవుడ్ నిర్ఘాంతపోయింది. ఈ మధ్యే కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భరత్ పలు సందర్భాల్లో డ్రగ్స్ వివాదంలో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ సమయంలో రవితేజ పేరు చెడగొడుతున్నాడంటూ అతనిపై విమర్శలు కూడా వెలువడ్డాయి.
అయితే కెల్విన్, జిషాన్ విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. దీంతో కెల్విన్ తో పాటు, జిషాన్ విచారణలో కూడా రవితేజ పేరు వెలుగు చూసింది. డ్రగ్ సరఫరాదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జిషాన్ కు గత ఆరేళ్లుగా రవితేజతో సన్నిహిత సంబంధాలున్నాయని సిట్ అధికారులు గుర్తించారు. రవితేజకు కెల్విన్ ను పరిచయం చేశానని, డ్రగ్స్ కూడా సరఫరా చేశానని జిషాన్ విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రవితేజ విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.
- Advertisement -
మరింత వేడెక్కనున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు…
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -