Friday, May 17, 2024
- Advertisement -

రెచ్చిపోయిన రేవంత్!

- Advertisement -

ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై రిలీజ్ అయిన రేవంత్ రెడ్డికి ఆయనను అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చర్లపల్లి జైలు నుంచి ఎన్‌టిఆర్‌ భవన్ వరకు అభిమానులు, టిడిపి కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. 

ర్యాలీలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ పై నిప్పులు చెరిగారు. పరుష పదజాలంతో రెచ్చిపోయారు. 

కేసిఆర్ దోపీడిని ప్రశ్నించినందుకే నాపై కుట్ర పూరితంగా కేసు పెట్టారంటూ రేవంత్‌ ఆరోపించారు.  నాపై ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ప్రయోగించి నన్ను జైలుకు పంపారు. నాకు బెయిల్ వచ్చింది కేసిఆర్‌కు జ్వరం వచ్చిందన్నారు. కేసిఆర్ కుటుంబాన్ని రాజకీయాల నుంచి తరిమి తరిమి కొట్టేలా తెలంగాణ ప్రజలను చైతన్య పరుస్తా అంటూ ఆగ్రహంతో ఊగి పోయారు. నా ముప్పై ఏళ్ళ పోరాటం టిఆర్‌ఎస్‌పై ఉంటుందన్నారు. కేసిఆర్‌ను తాగుబోతు, సన్యాసి ఇంకా చాలా పరుష పదజాలంతో రెచ్చిపోయారు. 

తెలంగాణ మంత్రులను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ వారందరూ లెసలెస మాట్లాడుతున్నారని, సోడాలు కలిపేవాళ్లు, మోండా మార్కెట్‌లో ఆలుగడ్డలు అమ్మే వ్యక్తి మంత్రులయ్యారని.. సన్నాసులంతా తాగుబోతోడి పక్షం చేరారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -