దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. నిత్యం లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా.. గత 24 గంటల్లో మాత్రం ఏకంగా రెండు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. మరణాలు సైతం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుల మొదలు ప్రముఖుల వరకు ఎవరినీ వదలడం లేదు ఈ మహమ్మారి.
ఇప్పటికే దేశంలో పలువురు రాజకీయ నేతలు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నిల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలోని సమ్సేర్గంజ్ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగిన రిజావుల్ హక్ ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన కోల్కతాలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం విషమించి గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. కాగా, బెంగాల్ లో నాల్గు దశల్లో పోలింగ్ జరగాల్సివుంది. సమ్సేర్గంజ్ నియోజవర్గానికి ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. కాగా, బెంగాల్ కరోనా ప్రభావం క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు అక్కడ 6,30,116 కేసులు, 10,458 మరణాలు నమోదయ్యాయి.
ఇస్రో సైంటిస్టు అరెస్టు.. సీబీఐ విచారణకు ఆదేశం
కాకతీయగడ్డపై రుద్రమ తర్వాత మళ్లీ షర్మిలే.. !
కీరదోస.. బరువు తగ్గించే సులువైన మార్గం..!
తేలికగా తీసుకోవద్దు.. కరోనాపై ఎయిమ్స్ చీఫ్ వార్నింగ్!
rezaul haque congress candidate from samsherganj dies of covid-19