- Advertisement -
భారతీయ జనతా పార్టీ మహిళల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని, అందుకని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో మహిళలను కూడా తీసుకోవాలని భూమాత బిగ్రేడియర్ నాయకురాలు తృప్తి దేశాయ్ డిమాండ్ చేశారు.
మహిళలలను ఆలయాల్లోకి అనుమతించాలని, స్త్రీల సమాన హక్కుల కోసం పోరాడుతున్న తృప్తి దేశాయ్ ఆర్ ఎస్ ఎస్ లో మహిళలుండాలని అన్నారు. ఈ మేరకు ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కు లేఖ రాయనున్నట్లు ఆమె చెప్పారు. స్త్రీ, పురుష సమాన హక్కుల కోసం మోహన్ భాగవత్ మద్దతు కోరతామని ఆమె వెల్లడించారు.
తృప్తి దేశాయ్ చేసిన పోరాట ఫలితంగా ఇటీవల శనిశింగణాపూర్, నాసిక్ త్రియంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలకు అనుమతిస్తున్నారు.