వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా.. ఉన్నప్పుడు ఏపీని రాజకీయాల్ని శాసించిన విషయం తెలిసిందే. అప్పట్లో వై ఎస్ కి తోడుగా ఉన్న కేవీపీ, ఉండవల్లి లాంటి నేతలు.. ఇప్పుడు తన స్నేహితుడి కొడుకు జగన్ కి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
{loadmodule mod_custom,GA1}
ప్రత్యక్షంగా వైసీపీలో చేరినా.. చేరకపోయినా.. జగన్ కి మేలు జరిగేలా అడుగులు వెయాలని.. ఇటివలే రహస్యంగా జరిగిన ఓ సమావేశంలో అనుకున్నారట. ఈ సమావేశంలోనే వై.ఎస్ కి దగ్గరగా ఉండి జగన్ కి దూరమైన వారిని దగ్గరికి తెచ్చేలా ఉండవల్లికి అప్పజెప్పారట కేవీపీ. తన రాజకీయ గురువుగా చెప్పుకునే కేవీపీ మాటని.. తూచా తప్పకుండా పాటిస్తూ ఉండవల్లి ఇప్పటికే రంగంలోకి దిగి పని చేసుకుంటూ వెళ్తున్నారట. జగన్ కి మద్దతుగా ఉండవల్లి ప్రతిపాదనకు ఎక్కువ మంది నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారని తెలుస్తోంది. మాజీ ఎంపీ సబ్బం హరి.. ఇకపై రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని భావిస్తున్నారట. అది తెలుసుకునే పాత మిత్రుడు ఉండవల్లి ఆయన్ని కలిసి… జగన్ కి అండగా నిలుద్దామని ప్రతిపాదించాడట. అయితే ఒకప్పుడు అందరికన్నా ముందు జగన్ ని బలపరిచి కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహానికి గురైన సబ్బం హరి ఆ తర్వాత జగన్ కి దూరమయ్యారు. ఇప్పుడు మళ్ళీ జగన్తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నాడనేది సమాచారం.
{loadmodule mod_custom,GA2}
దీంతో జగన్ గెలుపుకి సబ్బం హరి కూడా చెయ్యి వేస్తున్నాడని అందరూ చర్చించుకుంటున్నారు. ఏది ఏమైన వైఎస్కి ఎంతో ఆప్తులుగా ఉన్న నాయకులు ఇప్పుడు జగన్తో కూడా కలిసి ప్రయాణించడానికి ఇష్టపడడంతో వైసీపీకి మంచి రోజులు వచ్చాయని.. వచ్చే ఎన్నికలో వైసీపీ అధికారంలోకి వస్తుందని.. టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
{youtube}XZ-6b3Y6pPs{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related