Thursday, April 25, 2024
- Advertisement -

అమెరికాలో కాల్పుల మోత.. 12 మంది మృతి

- Advertisement -

అమెరికాలో మరోసారి కాల్పులు చెలరేగాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 12 మంది మరణించారు. కొలరాడోలో పుట్టినరోజు పార్టీ జరుగుతుండగా ఓ ఉన్మాది కాల్పులు జరిపాడు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మరణించారు. కాల్పుల తర్వాత నిందితుడు తనను తాను కాల్చుకొని చనిపోయాడు. వేడుకలు జరుపుకుంటున్న కుటుంబంలోని మహిళకు నిందితుడు స్నేహితుడేనని పోలీసులు నిర్ధారించారు.

ఉడ్‌ల్యాండ్‌లో జరిగిన మరో ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నిందితుడు తన పొరుగు ఇంటిలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఆ ఇంట్లోని మరో మహిళ పారిపోయేందుకు ప్రయత్నించగా.. వెంబడించి మరీ హతమార్చాడని తెలిపారు. తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన మరో ఇద్దరిపైనా కాల్పులు జరిపాడని, అందులో ఒకరు చికిత్స పొందుతూ మరణించగా.. మరొకరు కోలుకుంటున్నాడని స్పష్టం చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుని ఇంటికి చేరుకుకొనేలోపు ఇంటిని తగులబెట్టుకున్నాడు.. అంతే కాదు పోలీసులపై కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు తిరిగి కాల్పులు జరపడంతో మరణించాడు. నిందితుడికి చెందిన రెండు వాహనాల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఓ హ్యాండ్​గన్, పెద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ హింసకు పాల్పడేందుకు గల కారణాలు తెలియలేదు.

సంపూ ‘క్యాలీఫ్ల‌వ‌ర్’ టీజర్ రిలీజ్

ఏపిలో కరోనా కల్లోలం.. 92 మంది మృత్యువాత!

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -