Wednesday, May 8, 2024
- Advertisement -

ప్ర‌భుత్వానికి భారీగా బొక్క‌పెట్టిన టెలికం కంపెనీలు…కాగ్ రిపోర్ట్‌లో బ‌య‌ట‌ప‌డిన నిజాలు…

- Advertisement -

దేశంలో ప్ర‌ధాన టెలికంకంపెనీలైన భార‌తీ ఎయిర్‌టెల్‌,వొడాఫోన్‌,ఐడియా ప్ర‌యివేట్ కంపెనీల గుట్టు బ‌య‌ట‌ప‌డింది.రెవిన్యూల‌ను త‌క్కువ చేసి చూపించి ప్ర‌భుత్వానికి ట్యాక్స్‌ను క‌ట్ట‌కుండా ఏక‌నామం పెట్టారు.ఇదంతా కాగ్ రిపోర్ట్‌తో నిజాలు వెల్ల‌డ‌య్యాయి.

ప్రైవేట్‌ టెలికాం కంపెనీల గట్టును కాగ్‌ రట్టు చేసింది. 2010-11, 2014-15 మధ్య కాలంలో వీరు తక్కువ చేసి చూపించిన రెవెన్యూ విలువపై కాగ్‌ ఓ నివేదిక రూపొందించి పార్లమెంట్‌కి సమర్పించింది. ఈ రిపోర్టులో ఆరు ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు రూ.61,064.5 కోట్ల రెవెన్యూలను తక్కువ చేసి చూపించినట్టు తెలిపింది. దీంతో ప్రభుత్వానికి రూ.7,697.6 కోట్ల చెల్లింపులు తగ్గిపోయాయని కాగ్‌ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) శుక్రవారంపార్లమెంట్‌లో సమర్పించింది.

కాగ్‌ తన ఆడిట్‌లో ఆరు ఆపరేటర్లు అడ్జెస్టడ్‌ గ్రాస్‌ రెవెన్యూలు మొత్తం రూ. 61,064.56 కోట్లకు తగ్గించి చూపించాయని పేర్కొంది. భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యులార్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, ఎయిర్‌సెల్‌ వంటి ఐదు ఆపరేటర్లకు సంబంధించిన 2010-11 నుంచి 2014-15 కాల ఆడిట్‌ రిపోర్టులో ఇవి బయటపడ్డాయి.

సిస్టెమా శ్యామ్ అనే కంపెనీ 2006-07 నుంచి 2014-15 ఈ చర్యకు పాల్పడిందని తెలిసింది. రెవెన్యూ షేరును తక్కువ చేసి చూపించడంతో ప్రభుత్వం భారీ మొత్తంలోనే చెల్లింపులను పోగట్టుకుందని కాగ్‌ రిపోర్టు తేల్చింది. మ‌రి ప్ర‌భుత్వం వీటిమీద ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -