- Advertisement -
దేశీయ మార్కెట్లు ఇవాళ(సోమవారం) ట్రేడింగ్ ముగిసే సరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఈ వర్షాకాలం చివరి రెండు నెలల్లోనూ సాధారణ వర్షపాతం పడుతుందంటూ భారత వాతావరణ శాఖ చెప్పిన చల్లని కబురుతో నేటి స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. ఈ రోజు ఉదయం నుంచే లాభాల్లో కొనసాగిన మన మార్కెట్లు చివర్లో కూడా లాభాలతోనే క్లోజ్ అయ్యాయి
మార్కెట్లు ముగిసే సరికి సెన్సెక్స్ 136 పాయింట్లు లాభపడి 37, 692 వద్ద స్థిరపడగా, మరో సూచీ నిఫ్టీ 27 పాయింట్లు బలపడి 11,387 వద్ద ముగిసింది.
ఇక లాభాలు పండించుకున్న షేర్ల విషయానికి వస్తే, ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, రెడ్డీ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా, గెయిల్, హెచ్ యూఎల్, టైటాన్ కంపెనీల షేర్లు నష్టాలను పొందాయి.