- Advertisement -
వేర్వేరు దేశాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు విధించింది. ఈ రోజు నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రకటించింది.
విదేశాలను నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కొవిడ్ సర్టిఫికెట్ తీసుకురావాలని, ప్రయాణానికి 72 గంటల ముందు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. విమానాశ్రయం వద్ద అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆంక్షలపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు యధావిధిగా కార్యకలాపాలు జరుగుతాయని స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు విధించమని చెప్పిన కొన్ని గంటలే ఈ నిబంధనలను అమలు చేయడం గమనార్హం.