నిర్మల్ జిల్లా ముథోల్ గ్రామపంచాయతీ 4వ వార్డు సభ్యురాలు లక్ష్మిని అపహరించినందుకు ముగ్గురిపై రాత్రి కేసు నమోదు అయింది. సర్పంచ్, ఉపసర్పంచ్ను పదవి నుంచి కలెక్టర్ తొలగించడంతో సోమవారం తాత్కాలిక సర్పంచ్ ఎన్నిక జరగనుంది.
ఈ నేపథ్యంలో వార్డు సభ్యులు రెండు గ్రుపులుగా ఇప్పటికే విడిపోయి రహస్య శిబిరాలకెళ్లారు. తాత్కాలిక సర్పంచ్ ఎన్నికకు 08 మంది అవసరం ఉంది. ఇక్కడ 15 మంది మాత్రమే ఉన్నారు. 4వ వార్డు సభ్యురాలైన లక్ష్మిని గ్రామానికి చెందిన ముగ్గురు అపహరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కుటుంబికుల ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అజయబాబు తెలిపారు. తాత్కాలిక సర్పంచ్ ఎన్నికకు ఒక్క రోజే గడువుంది. వార్డు సభ్యురాలి అపహరణ రాజకీయంగా దూమరం రేపుతోంది. సర్పంచ్ ఎన్నిక ఉత్కంఠగా మారింది.
నాలుగో విడత పోలింగ్ శాతం.. అత్యధికంగా అక్కడే..!
రెండో పెళ్లికి సిద్దమైన మరో నటి?
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్..!
భగ్గుమన్న ఇరు వర్గాలు.. మధ్యలో పొలింగ్ ఏజెంట్ పై కన్నెర్ర..!