Monday, April 29, 2024
- Advertisement -

రెండో పెళ్లికి సిద్దమైన మరో నటి?

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో ఈ మద్య ప్ర‌ముఖులుగా వెలుగొందుతున్న వారు.. రెండో పెండ్లి చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న విష‌యాలు చూస్తూనే ఉన్నాం. పిల్లలు పెద్దవారైన తర్వాత తాము ఒంటరి జీవితాన్ని గడపడం కష్టమని భావించిన వారు పిల్లల అనుమతితో ఓ ఇంటివారవుతున్నారు. నిర్మాత దిల్ రాజు, ప్ర‌ముఖ గాయ‌ని సునీత మ‌రో పెండ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టారు. అయితే తాజాగా ఈ జాబితాలో మ‌రో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి ‌చేరబోతున్న ఊహాగానాలు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 

నటి సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది…ఇక బుల్లితెర పై మొగుడ్స్ పెళ్ళామ్స్ అనే షో ద్వారా పాపులర్ అయిన తరువాత వరుస సినిమాల్లో అక్క,వదిన,పిన్ని వంటి పాత్రలు పోషిస్తూ.. ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయ్యింది. 2019లో సురేఖావాణి భ‌ర్త అనారోగ్యం కార‌ణంగా తుదిశ్వాస విడిచాడు. దీంతో సురేఖావాణి త‌న కూతురు సుప్రీత‌తో క‌లిసి ఒంటరి జీవితానికి కొన‌సాగిస్తున్నారు.

సింగర్ సునీత వివాహం చేసుకోవాల‌న్న నిర్ణ‌యాన్ని చాలా మంది స్వాగతించారు. ఈ నేప‌థ్యంలో సుప్రీత కూడా త‌న త‌ల్లి సురేఖావాణిని మ‌ళ్లీ పెండ్లి చేసుకోవాల‌ని సూచించిన‌ట్టు టాలీవుడ్ లో జోరుగా వ‌ర్త‌లు వ‌స్తున్నాయి. కూతురు సుప్రీత ఈమెను ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి సోషల్ మీడియాకి అలవాటు చేసింది.వీళ్లిద్దరి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్చల్ చేస్తాయి.

మొత్తానికి ఈ నేప‌థ్యంలో సుప్రీత కూడా త‌న త‌ల్లి సురేఖావాణిని మ‌ళ్లీ పెండ్లి చేసుకోవాల‌ని సూచించిన‌ట్టు టాలీవుడ్ లో జోరుగా వ‌ర్త‌లు వ‌స్తున్నాయి. కాగా, ఈ వార్తపై సురేఖా వాణి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.. కేవలం పుకార్లు మాత్రమే వినిపిస్తున్నాయి.

షాక్.. మనుషులకూ వ్యాపించిన బర్డ్ ఫ్లూ…!

కేరళ పోలీస్‌ యాప్‌లో అల్లు అర్జున్

పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన కరీనా కపూర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -