Monday, April 29, 2024
- Advertisement -

శ్రీశైలంలో క‌ల‌క‌లం రేపుతున్న ప్లాస్టిక్ బియ్యం

- Advertisement -
Suspected Plastic Rice Found in Srisailam

అన్నం ప‌ర‌బ్ర‌హ్మ‌స్వ‌రూపం అంటారు పెద్ద‌లు.ప్ర‌తీ జివి మ‌నుగ‌డ సాగించాలంటె ఆహారం త‌ప్ప‌నిస‌రి.కాని ఇప్పుడు ఎక్క‌డ చూసినా క‌ల్తీ మ‌య‌మే.చిన్న పిల్ల‌వాడు పాలు తాగ‌డం మొద‌లుకొని బియ్యం వ‌ర‌కు క‌ల్తీనే.తాజాగా అక్ర‌మార్కుల‌కు క‌ల్తీ బియ్యం వ్యాపారం వ‌రంగా మారింది.మార్కెట్‌లో క‌ల్తీ బియ్యం క‌ల‌కం రేపుతున్నాయి.

స్థానిక మల్లికార్జున సదన్‌ కాంప్లెక్స్‌లోని ఓ దుకాణంలో ప్లాస్టిక్‌ బియ్యం కల్తీ చేసి విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. వన్‌టౌన్‌ పోలీసులు తమకు అందిన సమాచారం మేరకు ఈ దుకాణంలో విస్తృత సోదాలు జరిపారు. శ్రీశైలానికి వ్యాపార సంబంధమైన సరుకులు కర్నూలు, నంద్యాల, మార్కాపురం, విజయవాడ, హైదరాబాద్‌ నుంచి దిగుమతి అవుతూ ఉంటాయి.
ఓ వ్యాపారి కొన్ని బస్తాల ప్లాస్టిక్‌ బియ్యాన్ని నంద్యాల నుంచి తెప్పించి కల్తీ చేసి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బియ్యంతో తయారు చేసిన అన్నం తినడంతో కడుపునొప్పి వస్తోందని అంటున్నారు. క్షేత్రపరిధిలో మూడు నాలుగు కిరాణా దుకాణాలు కొందరు వ్యాపారులు బియ్యం మాత్రమే బయటి నుంచి తెప్పించి విక్రయిస్తున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

శ్రీశైలంలో నిబంధనలకు భిన్నంగా జరిగ‌డంతోపాటు ఎమ్ఆర్‌పీ క‌న్నా ఎక్కువ రేట్ల‌కు వ్యాపారులు స‌రుకులు అమ్ముతున్నారు. కొలతల శాఖ గాని, పౌరసరఫరాల శాఖ అధికా రులు గాని తనిఖీలు జరిపిన దాఖాలు మచ్చుకైనా లేవు. దీంతో కొందరు కిరాణ వ్యాపారులు ప్లాస్టిక్‌ బియ్యం తెప్పించి కల్తీ చేసి విక్రయిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్ర‌జ‌లంద‌రూ జాగ్ర‌త్త‌.పొర‌పాటున ఈప్లాస్టిక్ బియ్యం తిన్నారో ప‌ర‌లోకాల‌కే.

{loadmodule mod_custom,Side Ad 2}

Also read

  1. ఒక మగడు.. మరో మగవాడి వల్ల గర్భం దాల్చాడు
  2. టైం దొరికితే.. హీరోయ‌న్ ఇంటికి వెళ్లి ఆ తెలుగు హీరో ఏం చేస్తాడంటే..?
  3. నిద్ర‌మాత్ర‌లు వాడుతున్నారా….అయితే మీప‌ని గోవిందా…
  4. మ‌నుషుల్ని తినే ప‌ర్వ‌తం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -