ఇప్పుడు ఎక్కడ చూసినా విజయవాడ లో దేవాలయాల కూల్చివేత విషయం గురించి మాట్లాడుతున్నారు. అందరి నోటా ఇదే హాట్ టాపిక్ గా మారిన తరుణం లో, పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా అవన్నీ కూల్చేస్తున్నాం అని అధికారులు కవర్ చేసుకుంటునారు. ఈ వ్యవహారం టీడీపీ – బీజేపీ మధ్యన ఉన్న దూరాన్ని ఇంకా ఇంకా పెంచుతూ ఉండడం విశేషం.
ఆలయాలు కూల్చేసిన విషయం లో బీజేపీ మండి పడుతూ విజయవాడ ఎంపీ కేసినేని నాని మీడియా యమా సీరియస్ అవుతోంది. దానికి రివర్స్ లో భాజాపా ది రాజకీయ శైలి అనీ అభివృద్ధి ని అడ్డుకుంటున్నారు అని నాని అంటున్నారు. గుజరాత్ లో కూడా మూడొందల ఇల్లు , ఎనభై దేవాలయాలూ కూల్చేసారు అనీ అప్పుడు వారు ఎవ్వరికీ ఇది తప్పు అని అనిపించలేదా అంటున్నారు నాని. ఈ వ్యవారం లో స్వయంగా శివ స్వామీ జోక్యం చేసుకుని మరీ నాని మీద కోప్పడ్డారు. స్వామీజీలపట్ల తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని శివస్వామి మండిపడ్డారు.
ఆయన అక్రమ మార్గాల్లో సంపాదించారనీ, రూ. 500 ఉండే బస్ టిక్కెట్టును రూ. 2000 వేలకు అమ్ముకుని అక్రమ మార్గంలో సొమ్ము పోగేశాడని ఆయన మండిపడ్డారు. అలాంటి నాని తమపై దాడికి దిగడం అనుచితం అని శివస్వామి అన్నారు. తనకు ఎన్నో బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయనీ అయినా తాను బెదిరిపోలేదనీ, తాను శివభ క్తుడనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ సూర్యుడు ఎర్రగానే ఉంటాడనే సంగతిని ఆయన తెలుసుకోవాలన్నారు. ఇకమీదట ఎంపీగా విజయవాడ లోనేకాదు ఇంకెక్కడా ఆయన గెలిచే అవకాశం లేదు అని స్వామీ కోప్పడ్డారు.