Monday, April 29, 2024
- Advertisement -

సుమేధ మరణం విషయంలో క్షమాణాలు చెప్పిన తలసాని.?

- Advertisement -

రాష్ట్రంలో సుమేధ మరణం అందరిని విషాద ఛాయల్లోకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.. నాలా వద్ద జరిగిన ప్రమాదంలో ఈ చిన్నారి అశువులు బాసింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు GHMC అధికారులపై కేసు నమోదు చేసి తమకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు.. దీనిపై తెలంగాణాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నాలాలను జీహెచ్ఎంసీ సరిగా నిర్వహించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని అన్నారు. ఈ నాలాలు ఎప్పటి నుంచో ఉన్న దరిద్రమని చెప్పారు. సుమేధ మృతి బాధాకరమని, ఆమె తల్లిదండ్రులకు క్షమాపణ చెపుతున్నామని అన్నారు.

మరోవైపు తమ కూతురు మరణించిన ఘటనలో మంత్రి కేటీఆర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ లపై సుమేధ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.. బంగారు తెలంగాణాలో ఇలాంటి ఘటనలు జరగడం ఒకింత బాధాకరమే అయిన ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకుంటే మంచిది అని ప్రజలు అంటున్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -