Sunday, May 5, 2024
- Advertisement -

కేర‌ళ‌ల‌కు త‌మిళ హీరో విజ‌య్‌ భారీ ఆర్థిక సాయం… తెలుగు హీరోలు ఎక్క‌డ‌?

- Advertisement -

గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు కేర‌ళ రాష్ట్రం కుదేలు అయింది.ఇంకా ఎడ‌తెగ‌ని వ‌ర్షాల‌తో కేర‌ళ రాష్ట్రం తీవ్ర న‌ష్ట‌పోయింది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ వరదలు కేరళను ముంచెత్తాయి. కేరళలో వరద బీభత్సానికి 324మంది చనిపోగా 3 లక్షలమంది నిరాశ్రయులయ్యారు. ఈ క్ర‌మంలో ప‌లు రాష్ట్ర‌ల నుంచి కేర‌ళ రాష్ట్రంకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.

దీంతో సినీతారలు – సెలబ్రిటీలు – వ్యాపారవేత్తలు – మీడియా సంస్థలు స్పందించి భారీగా విరాళాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్ , మాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు భారీ విరాళాలు ప్రకటించి తమ ఉదారతను చాటుకున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ కేరళ వరద బాధితుల సహాయార్థం… భారీ విరాళం ప్రకటించారు. తన వంతుగా 14 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఆర్థిక సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నట్లు విజయ్ ప్రకటించారు.మ‌న తెలుగు హీరోలు మాత్రం కోట్ల‌ల‌లో పారితోష‌కం తీసుకుంటారు.కాని ఇలాంటి స‌మ‌య‌ల‌లో ఇవ్వ‌డానికి మాత్రం ల‌క్ష‌ల్లో ఇస్తున్నార‌ని కామెంట్స్ చేస్తున్నారు.తెలుగు స్టార్ హీరోలు ఎవ‌రు కేర‌ళ వరద బీభత్సంపై స్పందించ‌లేదు.అల్లు అర్జున్‌,విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రమే మొద‌టిగా స్పందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -