Thursday, April 25, 2024
- Advertisement -

మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబంలో మరో విషాదం.. నెల రోజుల్లోనే ఇద్దరు కుమారులు మృతి!

- Advertisement -

టీడీపీ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబంలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఆయన రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి ( రవీంద్ర) కన్నుమూశారు. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయనను నగరంలోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కొన్ని రోజుల ట్రీట్మెంట్ తరువాత ఆయన ఆరోగ్యం కుదుట పడకపోవడం తో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేశారు.

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని పార్క్ హయత్ ప్లాజాలో ఉన్న రవీంద్ర బ్లడ్ వామిటింగ్‌తో అనుమానాస్పదంగా మృతిచెందినట్టు సమాచారం. రవీంద్ర మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి పోలీసులు తరలించారు. కొద్ది రోజుల క్రితమే మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ మరణించిన సంగతి తెలిసిందే.

అనారోగ్య సమస్యలతో ఏలూరు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మెరుగైన చికిత్స కోసం రాంజీని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఏది ఏమైనా మాగంటి బాబు ఇద్దరు కుమారులు అకాల మరణం చెందటం కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కాగా, మాగంటి రవీంద్ర మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంచలన నిర్ణయం తీసుకున్న నటి శ్రియా..!

బండ్ల గణేష్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్..

70 పులుల హంతకుడు ‘టైగ‌ర్ హ‌బీబ్’ అరెస్టు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -