తెలుగు ఇండస్ట్రీలో ఇష్టం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నటి శ్రియా సరన్. మొదటి సినిమా నిరాశ పరిచినా ఈ అమ్మడు తర్వాత టాప్ హీరోల సరసన వరుస ఛాన్సులు దక్కించుకుంది. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది. హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో కూడా మెప్పించింది. ఇటీవల ఆండ్రీ కొస్చెవ్ తో వివాహం జరిగిన తర్వాత ఈ అమ్మడు స్పెయిన్లో సెటిలైంది.
భర్త ఆండ్రీ కొస్చెవ్తో కలిసి స్పెయిన్లోని బార్సిలోనా నగరంలో కాపురం పెట్టింది. 2018లో ఆమె పెళ్లి సింపుల్గా ముంబయ్లో జరిగింది. అప్పటి నుంచి భర్తతో సంతోష జీవితాన్ని గడిపేస్తుంది.. అప్పుడప్పుడు విదేశాలకు ట్రిప్ కొట్టేస్తూ దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేస్తుంది. గత కొంత కాలంగా ఈ అమ్మడికి తన మాతృభూమిపై మనసు లాగేస్తుందట.. మూడేళ్ళ తర్వాత ఆమెకి ఇండియాకి తిరిగి రావాలని అనిపించిందట. ప్పుడు మూట ముల్లె సర్దుకొని ఇండియాకి వస్తోంది.
ఇకపై ఇండియాలోనే ఉంటామని చెబుతోంది శ్రియా. దీనికి సంబంధించి “ఇండియాకి తిరిగి వస్తున్నాము. ఇంటిని మిస్ అవుతున్నా. నమస్తే… బై బై” అని తన ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. శ్రియా, ఆమె భర్త ఇక ముంబయ్లో కాపురం పెడుతారు. ఇక ఆమె నటించిన ‘గమనం’ అనే తెలుగు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో చిన్న పాత్ర పోషిస్తోంది శ్రియా.
బండ్ల గణేష్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్..