టీడీపీ తరుపున ఒక రోజు నంద్యాల ఉప ఎన్నికప్రచారంలో హల్ చల్ చేశారు నందమూరి నటసింహం బాలయ్య. ఆయన ప్రచారంతో పార్టీ శ్రేనుల్లో ఉత్సాహం ఉరకలేసింది. బాలయ్య ప్రచారానికి వస్తె మైలేజేమొగాని…ఆయన ప్రవర్తన వల్ల పార్టీకి నష్టం జరగడంతోపాటు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. అభిమానిని చెంపబెబ్బకొడ్తున్న వీడియే సోషియల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది మరువక ముందె బాలయ్య ఘనకార్యం మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రచారంలో బాలకృష్ణ అక్కడికి వచ్చిన జనానికి డబ్బులు పంచుతున్న వైనం కెమెరాకు చిక్కడంతో టీడీపీలో ఆందోళన మొదలయ్యింది. దీంతో బాలయ్య అడ్డంగా బుక్కయ్యారు. డబ్బులు పంచుతున్న దృష్యాలు ఈసీకి వెల్లాయి. ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
బాలకృష్ణ వస్తె పార్టీకి ఊపు వస్తుందనుకుంటె …చివరికి నిరాశె ఎదురయ్యింది. ఆయన చేష్టల వల్ల వచ్చే ఓట్లుకూడా పడవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పార్టీ నాయకులు. ఇప్పటికే ప్రచారంలో వైసీపీ దూసుకుపోతుంటె టీడీపీ పార్టీ నాయకుల చేస్టల వల్ల పార్టీకి నష్టం తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.