Thursday, March 28, 2024
- Advertisement -

గుంటూరు జిల్లాలో మారుత‌న్న రాజ‌కీయాం.. వైసీపీలోకి టీడీపీ ఎంపీ ఫ్యామిలీ…

- Advertisement -

ఫ‌లితాలవిడుల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారిపోతున్నాయి. విజ‌యావ‌కాశాలు వైసీపీకే అనుకూలంగా ఉండ‌టంతో గోడ‌దూకేందుకు సిద్ద‌మ‌వుతున్నారు టీడీపీలోని సీనియ‌ర్ నాయ‌కులు. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో విజ‌యం మ‌న‌దేన‌ని బాబు ధీమాను వ్య‌క్తం చేస్తున్నా…. గా చెబుతున్నా ఆ పార్టీ నేతల్లో మాత్రం ఈ విషయంలో నమ్మకం కలగడం లేదనే టాక్ వినిపిస్తోంది.

తాజాగా టీడీపీ ఎంపీ కుటుంబం ప్యాన్ గూటికి చేరేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. టీడీపీ తరపున ఎమ్మెల్సీ సీటు ఆశించి భంగపడ్డ రాయపాటి శ్రీనివాస్… ప్రత్యేక హోదా విషయంలో టీడీపీని టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది. కాంగ్రెస్, టీడీపీ, జనసేనలను టార్గెట్ చేసిన రాయపాటి శ్రీనివాస్… వైసీపీని మాత్రం విమర్శించలేదు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం తన కుమారుడు రాయపాటి మోహన్ సాయికృష్ణ రాజకీయ భవిష్యత్తు కోసమే రాయపాటి శ్రీనివాస్ వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే రాయపాటి సాంబశివరావు అనుమతి లేకుండానే ఆయన సోదరుడు టీడీపీపై ఈ రకమైన విమర్శలు చేశారా అనే చర్చ కూడా నడుస్తోంది.

మ‌రోసారి టీడీపీ అధికారంలోకి రాద‌ని తెలిసిపోవ‌డంతో రాయపాటి ఫ్యామిలీ… మెల్లమెల్లగా వైసీపీ వైపు అడుగులు వేస్తోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తన కుమారుడు రంగబాబుకు సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు ఇవ్వనందుకు టీడీపీపై అసంతృప్తితో ఉన్న రాయపాటి సాంబశివరావు… మొదట సోదరుడు శ్రీనివాస్ కుటుంబాన్ని వైసీపీలోకి పంపి ఆ తరువాత తాను కూడా పార్టీ మారతారేమో అనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఫ‌లితాలు రాకముందే గుంటూరు రాజ‌కీయాల్లో శ‌ర‌వేగంగా మార్పులు చక‌చ‌కా జ‌రిగిపోతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -