Thursday, March 28, 2024
- Advertisement -

రాహుల్ గాంధీ – పేరు మారింది

- Advertisement -

డిల్లీ లోని జేఎన్యూ వ్యవహారం లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిస్థితి ముందు నోయ్యి వెనక గొయ్యి లాగా తయారు అయ్యింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో అనవసర రాద్ధాంతం చేసిన ఆయన జెఎన్యూ లో యాక్టివ్ గా అదే రీతిలో పాల్గొని లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నారు.

వారికి రాహుల్ సపోర్ట్ ఇవ్వడం పెద్ద ఎత్తున విమర్సాలకి తావిస్తోంది. రాహుల్ గాంధీ మీద హర్యానా లో రాజ ద్రోహం కేసు కూడా నమోదు అవ్వడం విశేషం. ఈ వ్యవహారం మీద బీజేపే కూడా సీరియస్ గా ఉంది. రాహుల్ గాంధీ తన పేరు పక్కన యాకుబ్ మెమన్ అని కానీ అఫ్జల్ గురూ అని కానీ చేర్చుకోవాలి అని సూచిస్తున్నారు బీజేపీ వారు.

ఉగ్రవాదుల్ని సమర్థించే వారికి.. దేశ సమగ్రతను విచ్చిన్నం చేసే కార్యక్రమాల్ని నిర్వహించే వారిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్.. కమ్యూనిస్ట్ మేధావులు సమర్థించటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ మీద తీవ్ర స్థాయి లో విరుచుకు పడ్డారు. రాహుల్ గాంధీ తన పేరుని పూర్తిగా మార్చుకుంటే బాగుంతుంది అని ఆయన ఎద్దేవా చేసారు. దేశ సమగ్రత కాపాడే విషయంలో రాహుల్ మీద చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -