- Advertisement -
మూసీనది ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర పురపాలక, ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు.. మూసీనది పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు.
ఈ ఉదయమే ఆయన మేయర్ బొంతురామ్మోహన్తో కలిసి మూసీ అధ్యయనానికి బయలుదేరారు. నది మురికికూపంగా మారిన తీరును, నది పరీవాహకం ఆక్రమణలకు గురవుతున్న తీరును కేటీఆర్ బృందం పరిశీలిస్తుంది. అనంతరం.. మూసీ ప్రక్షాళనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సంప్రదిస్తుంది.