Saturday, April 20, 2024
- Advertisement -

అమెరికా రోడ్డు ప్ర‌మాదంలో టీడీపీ నాయ‌కుడి కొడుకు దుర్మ‌మ‌ర‌ణం…

- Advertisement -

అమెరికాలోని ఒహోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణా కు చెందిన సాఫ్ట్‌వేర్ యువ‌కుడు మృతిచెందాడు. ఖ‌మ్మంజిల్లా తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన కొండబాల కరుణాకర్, శ్రీలక్ష్మీ దంపతుల కుమారుడు పృథ్వీ (21) గా గుర్తించారు అక్క‌డి పోలీసులు.

ఉన్న‌త చ‌దువుల‌కోసం అమెరికా వెల్లిన పృధ్వీ కొలంబస్ రాష్ట్రంలోని ప్రాంకిస్‌ యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. కొన్ని నెలల కిందటే ఉద్యోగంలో చేరాడు. తన రేస్ బైక్‌పై వెళ్తుండగా.. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ పృథ్వీ అక్కడికక్కడే మృతిచెందాడు.

పృథ్వీ నాన్న కరుణాకర్.. టీడీపీ మండల నాయకుడిగా పనిచేస్తున్నారు. దీంతో టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు పృథ్వీ తల్లిదండ్రులను కలిసి అతడి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేతికందిన కొడుకు మృతి చెండంతో త‌ల్లి,దండ్రులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు.

అధికారులతో మాట్లాడి అమెరికా నుంచి పృథ్వీ మృతదేహాన్ని భారత్‌కు తరలించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అతడి మృతదేహం స్వదేశానికి చేరడానికి కనీసం 4 రోజుల పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో దీంతో తిరుమలాయపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -