Thursday, May 9, 2024
- Advertisement -

తెలుగు తేజం.. బెంగాల్ అధికార బాషలో తెలుగు..!

- Advertisement -

బెంగాల్ అధికార భాషల్లోకి తెలుగు కూడా చేరింది. మంగళవారం నిర్వహించిన కేబినెట్​ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది మమత సర్కార్​. తెలుగును అధికార భాషగా ఆమోదించింది. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ వెల్లడించారు. తెలుగును అధికార భాషగా చేయాలని బెంగాల్ లోని తెలుగువారు ఎప్పటినుంచో డిమాండ్​ చేస్తున్నట్లు ఆయన మీడియా సమావేశంలో అన్నారు.

తెలుగును అధికార భాషగా చేయాలని.. ఆ కమ్యూనిటీ ఎప్పటినుంచో డిమాండ్​ చేస్తోంది. ఖరగ్​పుర్​ సదర్​ నుంచి ఎమ్మెల్యే ప్రదీప్​ సర్కార్​ నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఈ అంశంపై ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ నేపథ్యంలో.. తెలుగును అధికార భాషగా ఆమోదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఖరగ్​పుర్​లో అధికంగా ఉండే తెలుగు ప్రజల డిమాండ్​ మేరకే దీనిని పరిగణనలోకి తీసుకున్నాం అని విద్యా శాఖ మంత్రి తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -