గత కొంత కాలంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ సైన్యంపై కాల్పులకు తెగబడుతూనే ఉన్నారు. ఓ వైపు శాంతి ఒప్పందాలు అంటూనే మరోవైపు ఉగ్రవాదులను ప్రేరేపిస్తుంది దాయిది దేశమైన పాకిస్థాన్. తాజాగా పట్టపగలు, నడి రోడ్డుపై కాల్పులకు తెగ బడ్డారు. పోలీసులే టార్గెట్గా తుపాకీతో బుల్లెట్ల వర్షం కురిపించాడు. నగర్ భగత్ బర్జుల్లా ప్రాంతంలో శుక్రవారం ఈ దారుణం చోటు చేసుకుంది.
ఓ షాపు వద్ద పహారా కాస్తున్న సమయంలో షాలువా కప్పుకొని ఓ వ్యక్తి ఏకే 47 లోపల దాచుకొని సాధారణ వ్యక్తిలా రోడ్డుపైకి వచ్చాడు. అందరూ చూస్తుండగానే పోలీసులకు టార్గెట్ ని విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఊహించని ఈ ఘటనకు చుట్టు పక్కల ఉన్న స్థానికులు త్రీవ భయందోళనకు గురయ్యారు.
కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాది అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన గురించి తెలుసుకున్న ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్కడే ఉన్న సీసీకెమరాలో ఉగ్రవాది దాడి చేసిన దృశ్యాలు రికార్డయ్యాయి.
చలసాని శ్రీనివాస్ కుమార్తె ఆత్మహత్య .. కారణం అదేనా?
బండ్ల గణేశ్ కు పవన్ గ్రీన్సిగ్నల్.. పూరీ డైరెక్షన్లో మూడో చిత్రం.. !