Friday, May 3, 2024
- Advertisement -

అక్కడ మొదటి టీకా అధికారులకే.. కానీ..!

- Advertisement -

ఫైజర్​ టీకాకు ఇటీవల అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్​డీఏ) ఆమోదం తెలిపిన నేపథ్యంలో ట్రంప్​ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మొదటగా వ్యాక్సిన్​ను ట్రంప్​ అధికార వర్గంలోని పలువురు అధికారులకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్​ టైమ్స్​ పత్రిక తెలిపింది. అయితే వీరిలో ఎంతమందికి వ్యాక్సిన్​ను ఇవ్వనున్నారో స్పష్టత లేదని వివరించింది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదని స్పష్టం చేసింది.

ఏదేమైనా ట్రంప్​ అధికార వర్గం శ్వేతసౌధం వీడేలోపు వారికి టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని తెలిపింది. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్ సైతం..తాను వ్యాక్సిన్​ను ఎప్పుడు తీసుకోవాలన్న దానిపై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం.

ఫార్మా దిగ్గజం ఫైజర్​-బయోఎన్​టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​కు ఇదివరకే అమెరికా నిపుణుల కమిటీ ఆమోదం తెలపగా, ఇటీవల ఎఫ్​డీఏ సైతం వ్యాక్సిన్​కు ఆమోదముద్ర వేసింది. మూడు వారాల వ్యవధిలో రెండు డోసుల చొప్పున టీకాను తీసుకోవాలని వైద్యులు నిర్ధరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -