మాతృత్వానికి మచ్చ తెచ్చేలా, సభ్య సమాజం తల దించుకునేలా దారుణానికి ఒడిగట్టింది ఓ తల్లి. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో… 17 ఏళ్ల వయసున్న కన్న కొడుకునే హతమార్చింది. ఈ దారుణమైన సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లాకు చెందిన ఓ వివాహిత పద్మావతి 17 ఏళ్ల క్రితం భర్తతో విడిపోయింది. భర్తతో విడిపోయిన తర్వాత ఆమె కొంత కాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. మహిళకు హరి భగవాన్ అనే కుమారుడు ఉన్నాడు. తన సుఖాలకు కొడుకు అడ్డు వస్తున్నాడనే కారణంతో, అతని అడ్డు తొలగించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది.
మరో వ్యక్తితో వివాహేతర సంబంధం విషయమై తల్లితో కొడుకు హరిభగవాన్ వాగ్వావాదానికి దిగేవాడు.ఈ విషయమై తల్లీ, కొడుకు మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. కొడుకును అడ్డుతొలగించుకొనేందుకు ప్లాన్ వేసింది.
అతని ఆహారంలో నిద్రమాత్రలను కలిపి ఇచ్చింది. దీంతో, హరి నిద్రలోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన విజయనగరంలో కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.