- Advertisement -
టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు సీఐడీ నోటీసులు జారీ చేయడం హాస్యాస్పదమని టిడిపి శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ద్వారా సీఐడీ ఈ కేసును ప్రారంభించిందన్న ఆయన.. కేసు నమోదు చేయడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఇటీవల ఏపీ హైకోర్టు అమరావతి భూములలో వ్యాపారం లేదని పేర్కొందని గుర్తుచేశారు.
ఆళ్లకు ఏం సంబంధముందని ఆయన ద్వారా టిడిపి అధినేత చంద్రబాబుకు నోటీసులిచ్చారని.. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదమే లేదని హై కోర్టు ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశరు.
ఆయనకి సంతాపం తెలపడం చాలా బాధాకరం: సీఎం కేసిఆర్