తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే సమీప ఆసుపత్రికి ఆమెను తరలించి వైద్య చికిత్స అందించారు. ప్రమాదంలో గాయపడ్డ సుగుణమ్మను పలువురు నేతలు పరామర్శించారు.
విజయవాడలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమె అక్కడికి వెల్లారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా జరుగుతున్న మహానాడులో పాల్గొనేందుకు ఆమె తన కారులో వెళ్తుండగా స్థానిక బెంజి సర్కిల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే కారు, ఆటో ఢీకొట్టుకున్నాయి.
కాగా, మహానాడులో పాల్గొనేందుకు వస్తున్న బాపట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తోట మహాలక్ష్మి కారు కూడా నిన్న ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పగిలిపోవడంతో వాహనం అదుపుతప్పింది. ఆ వాహనం ముందు ప్రయాణిస్తున్న మదనపల్లి మున్సిపల్ చైర్మన్ కె.శివప్రసాద్ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహాలక్ష్మి భర్త నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి.